అలాంటి నిర్ణయం తీసుకున్న విజయ్ సేతుపతి.. షాక్ లో ఫ్యాన్స్..!

-

కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన ఈయన తెలుగులో పలు చిత్రాలలో విలన్ క్యారెక్టర్ లో నటించి మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విభిన్నమైన పాత్రలు.. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన .. సౌత్ ఇండియాలోనే బిజీ స్టార్లలో ఒకరిగా మారిపోయారు. అతడి నుంచి 2022లో వచ్చిన చిత్రాలు ఏవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. పైగా బాక్స్ ఆఫీస్ వద్ద వసూలను కూడా రాబట్టలేదు. ఈ నేపథ్యంలోనే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో.. నయనతార, సమంత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కాతు వాకుల రెండు కాదల్. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయింది. మరొకవైపు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో మెరిసాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరొక వైపు మలయాళంలో నటించిన 19(1)(a) కూడా నిరాశపరిచింది. మరికొన్ని చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి హీరోగా నటిస్తూనే .. విలన్ పాత్రలు పోషిస్తుండడంతో ప్రతి ఒక్కరు ఈయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఒకవైపు హీరోగా.. మరొకవైపు విలన్ గా ఎక్కువ చిత్రాల్లో చాలా సార్లు చూస్తుండడంతో అతడి చిత్రాలకు ఓపెనింగ్స్ రావడం లేదు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారట. అతిథి పాత్రలను చేయకూడదని నిర్ణయించుకున్నాడట. రోల్ బాగుంటేనే అతిధి పాత్రలకు ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక ఏడాదికి కోలీవుడ్లో మూడు చిత్రాలు.. ఇతర భాషల్లో మరో చిత్రం మాత్రమే చేయాలనుకుంటున్నట్లు విజయ్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news