శివరాత్రికి రీ రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య, అఖండ, దూకుడు, భీమ్లా నాయక్, టెంపర్, పుష్ప..

-

ఇప్పుడు చాలా వరకు ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు మళ్లీ విడుదలయ్యి అలరించాయి. స్టార్ హీరోల నుంచి వచ్చిన పలు సినిమాలు అభిమానుల్ని ఊర్రుతలూగించాయి. తాజాగా శివరాత్రి సందర్భంగా ఎనిమిది సూపర్ హిట్ సినిమాలు మళ్లీ విడుదలకు సిద్ధమయ్యాయి.. ఇప్పటికే విడుదలయ్యి మంచి హిట్ కొట్టిన సినిమాల్ని మళ్ళీ విడుదల చేసి కాసుల వర్షం కురిపించుకుంటున్నారు మేకర్స్. ఇదే ట్రెండ్ ఇప్పటివరకు ఫాలో అయ్యి పవన్ కళ్యాణ్ ఖుషి, తమ్ముడు.. మహేష్ బాబు ఒక్కడు విడుదల చేశారు. అయితే ఫిబ్రవరి 18న శివరాత్రి సందర్భంగా తన అభిమాన హీరోలు సినిమాలు చూస్తూ జాగారం చేసేటట్టు ఫన్నీగా ప్లాన్ చేశారు మేకర్స్..

ఈ మేరకు హైదరాబాదులో 8 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాని ఫిబ్రవరి 18 అర్ధరాత్రి హైదరాబాద్ సంధ్య 70MM థియేటర్ లో గం.12.15 ఒక షో.. 3 గంటలకు ఒక షో వేయనున్నారు. అలాగే బాలకృష్ణ శివతాండవం చేసిన ‘అఖండ’ చిత్రాన్ని.. హైదరాబాద్ సుదర్శన్ 35MM లో గం.12.15 షో.. మరో థియేటర్ సుష్మ 70MM లో గం.11.49 గంటలకు షో వేయనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని.. కొత్త పేటలోని మహాలక్ష్మి కంప్లెక్స్ లో 3 గంటలకు ప్రదర్శింస్తుండగా.. మహేష్ బాబు దూకుడు చిత్రాన్ని సుదర్శన్ లో 3 గంటలకు.. సరిలేరు నీకెవ్వరు మూవీని మహాలక్ష్మి కంప్లెక్స్ లో 11.59 కి ప్రదర్శించబోతున్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిన టెంపర్ సినిమాని హైదరాబాద్ దేవి థియేటర్ లో 12.15 లకు వేయగా సంధ్య థియేటర్ లో 12.30 లకు షోలు వేయనున్నారు. ఇక రీసెంట్ సెన్సేషన్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ ని సుష్మ 70MM లో 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు. అయితే న్యూస్ తెలుసుకున్న అభిమానులంతా తెగ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news