నాగ్ వ‌ర్సెస్ బాల‌య్య‌… గొడ‌వ‌లు త‌గ్గ‌లేదా…!

-

నంద‌మూరి బాల‌కృష్ణ‌..యువ‌సామ్రాట్ నాగార్జున మ‌ధ్య ఇంకా గ్యాప్ కంటిన్యూ అవుతున్నట్లే ఉంది. అందుకు మ‌రో సాక్ష్యం దొరికింది. ఎన‌భైల‌ నాటి హీరో హీరోయిన్ లు `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తియేటా పార్టీ చేసుకుంటూ వ‌స్తున్నారు. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి ప‌దో వార్షికోత్స‌వం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ పార్టీకి హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి సొంత ఇల్లే వేదికైంది. బాలీవుడ్, టాలీవుడ్ – కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

ఈ రీయూనియ‌న్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తార‌లు సంద‌డి చేశారు. అయితే ఈ పార్టీలో హీరో బాల‌కృష్ణ క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం రూలర్ సినిమాతో ఆయ‌న బిజీగా ఉన్నారు. డిసెంబ‌ర్ 20న విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించారు. షూటింగ్ బిజీ వ‌ల్ల పార్టీకి రాలేద‌ని మెగాస్టార్ స‌హ న‌టుల‌కు స‌ర్ది చెప్పినా అస‌లు విష‌య మాత్రం అదికాద‌ని తెలుస్తోంది. నాగార్జున‌తో ఆయ‌న‌కున్న విబేధాల‌తోనే పార్టీకి రాకుండా దూరంగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాస్త‌వానికి ఇంత‌కు ముందు కూడా అగ్ర‌హీరోలు ఈ పార్టీకి దూరంగా..వారివారి ప‌నుల్లో బిజిగా ఉండి హాజ‌రుకాలేక‌పోయారు. కానీ వారిపై ఇలాంటి చ‌ర్చేమీ జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తేడాది జ‌రిగిన పార్టీకి నాగార్జున, జ‌గ‌ప‌తి కూడా హాజ‌ర‌వ‌లేదు. కానీ ఈసారి అమ‌ల‌తో క‌లిసి నాగ్ ఈ పార్టీకి అటెండ్ కావ‌డం విశేషం. వీరితో పాటు వెంక‌టేష్‌, సుమన్‌,జ‌గ‌ప‌తిబాబు,భానుచంద‌ర్‌తో పాటు శ‌ర‌త్ కుమార్‌,ప్ర‌భు కూడా పార్టీలో సంద‌డి చేశారు.

నాటిత‌రం సూప‌ర్ హీరోయిన్లుగా కుర్ర‌కారు గుండెల్లో నిద్ర‌పోయిన రాధిక‌,సుహాసిని,అమ‌ల‌, లిజి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. గ‌త ఏడాది జ‌రిగిన పార్టీకి బాల‌య్య అటెండ్ అయ్యారు. అయితే నాగార్జున రాలేదు..ఈ సారి నాగార్జున వ‌చ్చారు..కానీ బాల‌య్య రాలేదు… అంటూ ఇద్ద‌రి మ‌ధ్య కొన‌సాగుతున్న గ్యాప్‌పై సినీతార‌లు కూడా చ‌ర్చించుకున్నార‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news