మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ని అక్కినేని హీరో పక్కన చూడలేమంటున్నారే ..?

-

ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా వరస ఫ్లాప్స్ తర్వాత తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు, వాసు వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఫ్లాప్స్ తర్వాత అఖిల్ చాలా ఆశలు పెట్టుకొని నటిస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని అఖిల్ తండ్రి నాగార్జున దగ్గరుండి మరీ ఈ సినిమా వ్యవహారలు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా ఈ సినిమా సక్సస్ అన్నది ఎంతో కీలకం. ఒంగోలు గిత్త డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి భాస్కర్ తలుపు తట్టిన అవకాశం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.

 

ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందట. కొంత టాకీ పార్ట్ సాంగ్స్ బ్యాలెన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతో బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న చిత్ర యూనిట్ కరోనా షాకిచ్చింది. ప్రస్తుతం కరోనా దెబ్బకి అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాని ఆపేశారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజ హెగ్డే అఖిల్ సరసన నటిస్తోంది. వరుసగా సక్సస్ లను దక్కించుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటి గతం లో నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.రస్తుతానికి ఈ సినిమాలో సక్సస్ లో ఉన్నది అంటే ఒక్క హీరోయిన్ మాత్రమే.

ఇక పూజా హెగ్డే ఈ ఇయర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్ తో నటించిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. రెమ్యూనరేషన్ పరంగా కూడా ప్రస్తుతం పూజా హెగ్డే బాగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి డైరెక్టర్, హీరో కంటే హీరోయిన్ రెమ్యూనరేషనే ఎక్కువన్న టాక్ కూడా వినిపిస్తుంది, అయితే ప్రస్తుతం అఖిల్ తో నటిస్తున్న’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో పూజా హెగ్డే సూటవలేదన్న కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. అఖిల్ పక్కన చూస్తే పూజా హెగ్డే కాస్త పెద్దదిగా కనిపిస్తుందని చెప్పుకుంటున్నారట. అయితే కొన్ని పోస్టర్స్ లో అలా అనిపిస్తున్నప్పటికి సినిమాలో ఈ జంట చూడటానికి చాలా క్యూట్ గా ఉందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news