బూతులు తిట్టే వాళ్లను మోకాళ్ల పై కూర్చోబెడతాం : పవన్ కళ్యాణ్

-

బూతులు తిట్టే ప్రభుత్వాన్ని కాకుండా గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. గుడివాడలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నాకేం కొడాలి నానిని తిట్టాలని లేదు. కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే.. నా సొంత రక్తానికైనా ఎదురు తిరుగుతా.. బూతులు తిట్టేవాాళ్లను మోకాళ్లపై కూర్చొబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. అవినీతి కోటలను బద్దలు కొడతాం. వీళ్ల బూతులకు గోరీలు కడతాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే అని గుడివాడలో స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వారిని కూడా వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. జనసేన సభ కోసం స్థలం ఇచ్చిన రైతుల ఇళ్లు కూల్చారు. 30 కేసులు నమోదు అయిన జగన్ బెయిల్ పై ఉన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news