తెలంగాణకు మరోసారి అమిత్ షా.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

-

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అత్యధిక ఎంపీ స్థానాలు ఎలాగైనా గెలవాలని మోడీ, అమిత్ షాలు ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో మారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా షెడ్యూలు ఖరారు అయింది. రేపు మధ్యాహ్నం 1:55 గంటలకు బేగంపేటకు ఆయన చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఆసిఫాబాద్ జిల్లాకు మధ్యాహ్నం 3:05 గంటకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో షా పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్కు చేరుకుంటారు. 5:10 నుంచి 5:50 వరకు గిరిరాజ్ కాలేజీలో నిర్వహించనున్న సభలో ఆయన పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6:30 గంటలకు షా బేగంపేటకు చేరుకుంటారు. సాయంత్రం 6:50 నుంచి 7:35 వరకు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభలో షా పాల్గొంటారు. ఈ సభ అనంతరం సాయంత్రం 7:55 గంటలకు బేగంపేట నుంచి పశ్చిమబెంగాల్కు తిరుగు పయనమవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news