మహారాష్ట్ర గవర్నర్ తో కంగనా ఏం మాట్లాడింది..?

-

బాలీవుడ్ నటి కంగనా రానౌత్, శివసేన పార్టీ కి మధ్య జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆ తర్వాత ముంబైలోని కంగనా ఆఫీసు అక్రమంగా నిర్మింపబడ్డదన్న కారణంగా కూల్చివేతకి గురైంది. ప్రస్తుతం కోర్టు నుండి స్టే రావడంతో కూల్చివేత సగంలో ఆగిపోయింది. ఐతే ఈ విషయమై కంగనా, మహారాష్ట్ర గవర్నర్ ని కలిసింది.

తన సోదరి రంగోలితో కలిసి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యరితో సమావేశం అయ్యారు. తనకి జరిగిన విషయాన్ని గవర్నర్ కి విన్నవించుకున్నారని సమాచారం. ఆ విషయంలో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపింది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. అలా జరిగితే సమాజం పట్ల ఆడవాళ్ళకి విశ్వాసం ఏర్పడుతుందని అంది.

సొంత కూతురి మాటలు వింటున్నట్లుగా తన మాటలని గవర్నర్ విన్నాడని చెప్పింది. గవర్నర్ దాకా వెళ్ళిన ఈ విషయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news