యంగ్ హీరోల బాటలో కమల్ హాసన్.. సక్సెస్ అవుతారా..?

-

ప్రస్తుత కాలంలో యంగ్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు , ప్రభాస్ లను మొదలుకొని నేటి యంగ్ హీరోలు నితిన్, నాగచైతన్య వరకు ఇలా చాలామంది సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత యంగ్ హీరోల బాటలో విశ్వనటుడు కమలహాసన్ నడిచే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బు సంపాదించాలంటే ఒక్క సినిమాలు మాత్రమే సరిపోదు.. సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపార రంగాలలో పెట్టుబడి పెట్టనప్పుడే.. డబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పైదు అందరూ ఈ ఆలోచనలో పడ్డారు. హీరోయిన్లు కూడా ఇప్పుడు వ్యాపారంగంలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా కమలహాసన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా పాపులారిటీ దక్కించుకున్నారు.. 2008లో రాజకీయాలలోకి వచ్చిన నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.. ఇకపోతే కమలహాసన్ ఖద్దర్ వ్యాపారంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పటినుంచో ఖద్దర్ వస్త్రాలకు చేనేత కార్మికులకు మద్దతుగా నిలబడుతూ వచ్చారు ఇకపోతే హౌస్ ఆఫ్ ఖద్దర్ అనే వ్యాపార సంస్థను కూడా ప్రారంభించారు..

ఇప్పుడు ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడానికి ఖద్దర్ వస్త్రాల నిపుణులతో కలిసి మంగళవారం ఇటలీకి వెళ్ళినట్లు పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అదే వ్యాపారంగంలోకి దిగి ఈ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి ఇండస్ట్రీలో నటుడిగా సక్సెస్ అయిన కమలహాసన్ వ్యాపారంలో కూడా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news