“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మూడవ దశను ప్రారంభించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ …!

-

“పుడమి పచ్చగుండాలే – మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. ‘గ్రీన్ ఛాలెంజ్’ పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులను నామినేట్ చేస్తూ వారితో నాటించే కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడవ దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు శ్రీకారం చుట్టారు.

 

 

ఈ సందర్భంగా ప్రభాస్ .. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని అన్నారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా వెయ్యి ఎకరాల ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానన్నాడు.

ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు. ప్రభుత్వాలు అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న ఈ ఛాలెంజ్ లో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల తో పాటు సామాన్య ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతుండటం గొప్ప విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news