మహేష్ థియేటర్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ చూసిన వైఎస్ జగన్..!

-

సూపర్ స్టార్ మహేష్ ఈమధ్యనే ఏ.ఎం.బి సినిమా అని ఓ మల్టీప్లెక్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కోకాపేట్ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో సినిమా అనుభూతి పొందాలని సెలబ్రిటీస్ తో పాటుగా కామన్ ఆడియెన్స్ కూడా అనుకుంటారు. రీసెంట్ గా మహేష్ మేడం టుస్సాడ్స్ మైనపు బొమ్మని కూడా అక్కడే కొద్దిరోజులు ప్రదర్శనకు ఉంచారు. మహేష్ ఏ.ఎం.బి థియేటర్ కు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి వెళ్లడం జరిగింది.

అవెంజర్స్ ఎండ్ గేం సినిమా చూసేందుకు జగన్ ఏ.ఎం.బి సినిమాస్ కు వెళ్లారు. అవెంజర్స్ ఎండ్ గేం త్రీడీ వర్షన్ అది కూడా ఏ.ఎం.బి సినిమాస్ లో ఆ థియేటర్ ఎక్స్ పీరెన్స్ వేరేలా ఉంటుంది. అక్కడకు వచ్చిన జగన్ ను చూసి ఆడియెన్స్ అంతా షాక్ అయ్యారు. పెద్ద హంగామా లేకుండా వై.ఎస్ జగన్ అవెంజర్స్ సినిమా చూసి తిరిగి వెళ్లడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news