ఏకాదశి రోజు ఏం చేయాలి..?

-

ప్రతి నెలా వచ్చే ఏకాదశుల్లో ఉపవాసం చేయలేని వారు కనీసం ఈ వైకుంఠ ఏకాదశి నాడైనా వ్రతం ఆచరించాలని శాస్త్రం పేర్కొంది. ఈ రోజున ప్రాతఃకా-లమందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంట్లోని దేవునిగదిలో దీపారాధన చేసి విష్ణు భగవా-నున్ని ఆరాధించాలి. అవకాశం ఉంటే తామరవత్తులు, నెయ్యి లేదా కొబ్బరినూనెతో దీపారాధన చేయాలి. తులసి, బిల్వదళం, జాజిపూలు, సంపెంగలతో విష్ణు ఆరాధన చేయాలి. అనంతరం ‘ఓం నమో నారాయ-ణాయనమః’ లేదా మరేదైనా విష్ణు నామాన్ని జపిం-చడం లేదా కీర్తించడం చేయాలి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశినాడు ఉపవాసం ఉండాలనుకొనే వారు (వా-రివారి శరీర ధర్మాలను బట్టి) ముందు రోజు రాత్రి అంటే దశమి రాత్రి కేవలం అల్పాహారం తీసుకోవాలి.

ఏకాదశినాడు పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండాలి. ద్వాదశి నాడు పారణం చేయాలి. అంటే ఏకాదశి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజా-దికాలు పూర్తిచేసుకొని దేవునికి నైవేద్యాన్ని సమర్పించి, వెంటనే భోజనం చేయాలి. అవకాశం ఉంటే ఎవరి-నైనా భోజనానికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతిథితో కలిసి భోజనం చేస్తే విశేషమని పెద్దల అభి-ప్రాయం. అదేవిధంగా ద్వాదశి రాత్రి కేవలం అల్పా-హారం మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. కేవలం ఆహారం తీసుకో-కపోవడం మాత్రమే కాదు విష్ణు నామ పారాయణం, భజనలు, కీర్తనలు ఇలా ఏదో ఒకరకంగా దేవుడికి దగ్గరగా ఉండటం. సమీపంలోని విష్ణుదేవాలయానికి వెళ్లి ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే పేదలకు దానధర్మాలు చేయాలి. శరీరం సహక-రించనివారు, లౌకిక అవసరాలతో ఉపవాసం చేయ-లేని వారు కనీసం ఆ రోజు అంతా భగవన్నామ స్మర-ణతో తమ దైనందిన కార్యక్రమాన్ని పూర్తిచేసుకోవ-చ్చని శాస్ర్తాలు చెపుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల 12 రకాల ప్రయోజనాలు ఉంటాయని శాస్ర్తాలు వివరించాయి. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రి-యాలు, మనస్సు అంటే మొత్తం పదకొండింటిని భగవంతునికి సమర్పించాలని, ఈ పదకొండింటిని బుద్ధితో ఒకటిగా చేయడమే శుద్ధత్వం. అదే ఏకాదశి వ్రతం.

ఉపవాసం చేయలేని వారు ఏంచేయాలి ?

శాస్ర్తాలు.. వేదాలు పలు కఠినమైన నియమాలు చెప్పి-నప్పటికీ యుగధర్మాలను బట్టి చాలా సడలింపులు ఇచ్చాయి. ముఖ్యంగా ఆరోగ్య కారణాల వల్ల నాలుగు పూటలా ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు, పిల్లలు, వయోవృద్ధులు, ఉద్యోగావసరాలతో ఆయా నియమాలు పాటించనివారికి కొన్ని మినహాయింపు-లను శాస్ర్తాలు ఇచ్చాయి. ఏకాదశి వ్రతం ఆచరించలేని వారు ‘కీర్తనం – ప్రపదనం – ప్రసూనార్పణం’ చేయాలని పేర్కొన్నాయి. అంటే భగవన్నామ గానం, చేతులు జోడించి శరణాగతి, భగవంతుని పాదార్చన చేసుకొంటేచాలు. వీటి గురించి వాయుపురాణంలో ‘నక్తం హవిష్యం’ అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news