పసుపుతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు పోయి అదృష్టం పడుతుంది..

-

పసుపు గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో మనందరికీ తెలుసు.. అందం, ఆరోగ్యం మాత్రమే కాదు పూజలో వాడటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి పోతాయని నిపుణులు అంటున్నారు.. జీవితంలో ఆర్థిక సమస్యలు, లేదా ఏదైనా సమస్యలతో భాధపడుతుంటే పసుపుతో వాటిని నివారించవచ్చు అంటున్నారు.. మనం విష్ణువును, దేవ గురువు బృహస్పతిని పూజిస్తుంటాం..

బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపుకు సంబంధించిన కొన్ని పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతి గ్రహం అనేది పసుపుకు సంబంధించినది. పసుపు పరిహారాలను పాటిస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి ప్రసన్నం అవుతాడు. ఫలితంగా మీకు ఉన్న డబ్బు సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇక విష్ణువుకు పూజ చేస్తే లక్ష్మీ దేవి కటాక్షం కూడా లభిస్తుంది..

పసుపుతో ఎలా పరిహారం చెయ్యాలి..

మీరు కెరీర్‌లో అపజయాలు, అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే, గురువారం నాడు నీటిలో కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల సమస్యలు దూరమై విజయం చేరువవుతుంది… అలాగే మీకు ఆర్థిక సమస్యలు ఉంటే ఎర్రటి గుడ్డలో ఐదు పసుపు ముద్దలను కట్టి మీ డబ్బుల పెట్టెలో ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి మీ ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది…

ఇంటి బయటి గోడ లేదా ప్రధాన ద్వారం మీద పసుపుతో ఒక లైన్ గీయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుందని నమ్ముతారు. గురువారం పసుపు రేఖను గీస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.. బృహస్పతి బలహీనంగా ఉన్న వ్యక్తి గురువారం నాడు విష్ణువు, గురువు బృహస్పతిని పూజించాలి. పూజానంతరం, మణికట్టు మెడపై పసుపుతో చిన్న గీత రాయండి. ఇలా చేయడం వల్ల గురు గ్రహం బలపడుతుంది..వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే.. నల్ల పసుపు, కుంకుమపువ్వు కలిపి మీ డబ్బుల పెట్టెలో స్వస్తిక్ గుర్తు గీయండి.. అలాగే గురువారం నాడు పసుపును దానం చేసినా చాలా మంచిదే.. ఇలా పసుపుతో చెయ్యడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు..

Read more RELATED
Recommended to you

Latest news