దాంపత్య జీవితంలో గొడవలా.. ఈ పూలతో పూజ చేస్తే సంపద కూడా పెరుగుతుంది..

-

సంసారంలో గొడవలు రావడం కామన్.. అయితే వాటిని వెంటనే పరిష్కరించాలి.. లేదంటే విడిపోయే ప్రమాదం ఉంటుంది.. అయితే కొన్ని పూజలు చెయ్యడం వల్ల కూడా గొడవలు రావని పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రంలో కబంద పుష్పానికి సంబంధించిన అనేక చర్యలు ఉన్నాయి. కబంద పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఈ పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పన్ని చాలా ప్రభావంతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ పుష్పం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైనది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు కబంద వృక్షంపై కూర్చుని వేణును వాయించేవాడు. మీరు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం పొందాలనుకుంటే ఆయనకు కదంబ పుష్పాన్ని సమర్పించడం ఎంతో మంచిది..

ఇలా చెయ్యడం వల్ల కృష్ణుడు అనుగ్రహం పొందవచ్చు.. దీని ద్వారా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం త్వరలో లభిస్తుందని, అంతేకాకుండా కుటుంబంలో సంతోషం, శాంతి, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు. శ్రీకృష్ణ భగవానుడికి కదంబ పుష్పాన్ని సమర్పించడం ద్వారా బృహస్పతి బలపడతాడు. ఒక వ్యక్తి వ్యాపార, విద్యా, ఉద్యోగాలలో పురోగతిని కూడా సాధిస్తాడు. కబంద పుష్పాన్ని పైలాన్ రూపంలో ఇంటి ప్రధాన ద్వారం పై ఉంచితే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది..

ఇంటి పూజ గదిలో లేదా మీ ఖజానాలో ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి, విష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దీనితోపాటు సంపదలో ఎప్పుడు పెరుగుదల ఉంటుంది. అలాంటి ఇంటి కుటుంబ సభ్యులు అప్పుల నుంచి విముక్తి పొందుతాడు. అలాగే భార్యాభర్తలు కలిసి శ్రీకృష్ణుడిని, రాధను కబంధ పుష్పాలను సమర్పిస్తే ఎంతో మంచిది. అంతే కాకుండా వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news