బ్రహ్మదేవుడు ముందే తలరాతను రాస్తాడు కదా.. మరీ ఈ పూజలు, ఉపవాసాలు ఎందుకు..?

-

సాధరణంగా మనకు ఏదైనా జరిగినప్పుడు అంతా నా తలరాత దాన్ని మార్చలేం.. అందుకే ఇలా జరిగింది అని నిట్టూరుస్తారు. బ్రహ్మరాత రాసి ఈ భూమ్మీదకు పంపుతాడు. మొత్తం అంతా ఆయనే రాసినప్పుడు మనం ఎందుకు మళ్లీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాం, ఈ పూజలు ఎందుకు, మంచి పనులు చేయడం ఎందుకు, కష్టం రాగానే దేవుడిని ఎందుకు సాయం చేయమని కోరుకోవడం.. ఆయన కథలో భాగంగానే కదా అలా జరుగుతుంది..? ఇలా మీరెప్పుడైనా ఆలోచించారా..? తల రాత రాసిన బ్రహ్మ అందులో ఒక మాట రాశాడట.

అదేంటంటే నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ మీరు మీ ఉపవాసాలతో, మీ ఆలోచనలతో, మీ పనులతో మార్చుకోవచ్చు అని అన్నారట. అర్చనలు, ఉపవాసాలు, కర్మకాండ ద్వారా మీ విధిని మీరు చేతుల్లో పెడుతున్నాను అని అన్నారట. ఉదాహరణకి బ్రహ్మ తలరాతని రాసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆయుష్షును వందేళ్లు రాస్తే చేసే పుణ్య పాపాలుని బట్టి అవి మారుతాయి.

ఆయువు తగ్గచ్చు పెరగొచ్చు. అయితే మన యొక్క ఆయువును మార్చుకునే శక్తి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ అన్నారు. అలానే పురాణాలని శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుందట.

మీ అందరికీ ఒక కథ తెలియాలి. దానివల్ల మీకు ఈ విషయం గురించి ఇంకా వివరంగా తెలుస్తుంది. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు యాభై ఏళ్ళకి మరణ గండం వుంది. దానిని తప్పించుకోవాలని ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి ఆఖరికి బ్రతికాడు. ఇది చూసి జ్యోతిష్యులు ఆశ్చర్యపోయారు. అయితే అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నారు.. ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని అన్నారట. అందుకనే బ్రహ్మ రాసిన రాత మార్చుకోవడానికి మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం వంటివి చేస్తే వాటిని మార్చుకోచ్చు. అందుకనే మనం పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతకచ్చు. అలా బ్రతికిన వారూ వున్నారు.

దేవుడి కేవలం మీకు ప్రాణం పోసి మీరాతను రాసి పంపిస్తాడు.. ఈ లోకంలో మీరు చూసే పాపపుణ్యాలను బట్టి అది మారుతుందనేది ఈ కథ సారాంశం. కావాలని ఎవర్ని మోసం చేయకండి, తెలిసి తెలిసి తప్పులు అసలే చేయకండి. కష్టపడకుండా వచ్చే రూపాయి నిలవదు అని బాగా గుర్తుపెట్టుకోండి పండితులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news