హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వారణాసి టూర్.. ధర కూడా తక్కువే..!

-

ఐఆర్‌సీటీసీ ఎన్నో టూర్ ప్యాకేజీలను తీసుకు వస్తోంది. మీరు మీకు నచ్చిన చోట్లకి ఈ ప్యాకేజీలతో వెళ్ళచ్చు. తాజాగా ఐఆర్‌సీటీసీ తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దీనితో కాశీకి వెళ్లాలనుకునే వారు ఈ ప్యాకేజీని వినియోగించుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

‘మహాలయ పిండ దాన్’ పేరుతో ఈ ప్యాకేజీని ఇస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో వారణాసి, ప్రయాగ్ సంగం, గయ చూసేయచ్చు. 2022 సెప్టెంబర్ 15న ఈ టూర్ ప్యాకేజీ మొదలవ్వనుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుండి కాశీ వెళ్ళచ్చు. మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభం అవుతుంది.

తెల్లవారుజామున సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరుతుంది. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో ట్రైన్ ఎక్కచ్చు. సెకండ్ డే వారణాసి చేరుకుంటారు. గంగా నదిలో స్నానాలు, సైట్‌సీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత కాశీ విశ్వనాథ, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి, కాళ భైరవ ఆలయాలను చూడచ్చు. సాయంత్రం గంగా హారతి చూడచ్చు. రాత్రికి కాశీ లోనే స్టే చెయ్యాలి. మూడో రోజు ఉదయం వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్ళాలి.

నాలుగో రోజు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. త్రివేణి సంగంలో స్నానాలు చేసి ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తి పీఠ్ చూడచ్చు. నెక్స్ట్ శృంగవెన్పూర్ బయల్దేరాలి. రామాయణానికి సంబంధించిన ప్రాంతాలను చూసేచ్చు. ఐదో రోజు గయ చేరుకుంటారు. అక్కడ విష్ణుపాద ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు అయ్యాక బోధగయకు బయల్దేరాలి.

ఆ తర్వాత గయ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు మీ గమ్యస్థానాన్ని తిరిగి చేరుకుంటారు. టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.14,485 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.18,785. పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news