ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే దరిద్రం తాండవం చేసినట్లే..

-

కొన్ని వస్తువులను చూస్తే పాజిటివ్ ఎనెర్జీ వస్తుంది.మరి కొన్ని వస్తువులు ఎంత బాగున్నా కూడా వాటి వల్ల అన్నీ నష్టాలే కలుగుతాయి.ఉదాహరణను మనీ ప్లాంట్.. ఈ చెట్టు ఉంటే కొందరికి కలిసి వస్తుందని మరి కొంతమందికి కుటుంబ కలహాలు చికాకులు వస్తాయని జోతిష్యపండితులు అంటున్నారు. అలాంటి కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం అట..అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

వాస్తు ప్రకారం నిర్మించిన, వస్తువులు ఏర్పాటు చేసిన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఆ ఇంట్లోని కుటుంబం సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది.కుటుంబ సభ్యులలో ప్రేమ, సామరస్యం నెలకొంటాయి. అదే సమయంలో వాస్తు దోషం ఉంటే.. అనేక సమస్యలు తలెత్తుతాయి.ఇంట్లో లేనిపోని గొడవలు జరగడం తో పాటుగా దరిద్రం వెంటాడుతుంది. లక్ష్మీ దేవి ఇంటిని వీడి వెళ్లిపోతుంది..ఇంట్లో దిక్కులతో  పాటుగా,వాస్తు ప్రకారం ఉందా లేదా అన్నది ఒకటికి పదిసార్లు చూడాలి.

వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచ కూడని వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* వాస్తు శాస్త్రం ప్రకారం, నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదట. దీని వల్ల ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయట.

* వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధ చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ చిత్రాలు కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

* ఇకపోతే గులాబి మొక్కలు తప్ప మిగిలిన ముండ్ల మొక్కలను ఇంట్లో ఉంచరాదని అంటున్నారు.ముళ్ల చెట్లు ఉండటం వల్ల నెగటీవ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

*నీటిలో మునిగి పోతున్న పడవల ఫోటోలను, బొమ్మలను ఇంట్లో ఉంచరాదని అంటున్నారు. అవి అశుభానికి సంకేతాలు.

* అస్తమిస్తున్న సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కుటుంబ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.

* వాస్తు ప్రకారం ఉదయించే సూర్యుడు, గులాబీ పూల ఫొటోలు ఉంచాలని వాస్తు నిపుణులు అంటున్నారు. అప్పుడు ధనం దిన దినాభివృద్ధి జరుగుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news