వాస్తు: పటికతో ఇలా చేస్తే మీ సంపద రెట్టింపు అవ్వడం పక్కా..!!!

-

పటిక తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికి తెలుసు..అంతేకాదు మన దరిద్రాలను పొగొట్టి సంపదను పెంచడం లో ప్రముఖ పాత్ర వహిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.జోతిషం ప్రకారం పటికను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది..పటికను ఉపయోగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.

మనం వ్యాపార పురోగతి పొందడానికి, విద్యార్థులకు సంబంధించిన విషయాలకు ఎర్రటి గుడ్డలో కొద్దిగా పటికను చుట్టి ఆ వస్త్రాన్ని వ్యాపారంలో ఏ మూలనైనా ఉంచితే సమస్యలు దూరమవుతాయి. వ్యాపార పురోగతి ఉంటుంది..కొన్ని ఇళ్లలో తరచూ గొడవలు అవుతాయి. అప్పడు టెన్షన్లు కూడా ఎక్కువవుతాయి. అప్పుడు ఒక గిన్నెలో పటికను వేసి ఇంట్లోని ఏదైనా మూలలో పెట్టాలి. తద్వారా ఇంట్లోని గొడవలు తగ్గుతాయి. ఆ ఉద్రిక్త వాతావరణానికి తెరపడుతుంది..అంతా మామూలు అయిపోతుంది..

ఇకపోతే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారు పడుకునే మంచం కింద కుండలో నీళ్లు నింపి , ఆ నీటిలో కొద్దిగా పటికను వేస్తే, ఇంట్లో శాంతి నెలకొని, కుటుంబ కలహాలు తొలగిపోతాయి.ఒక గిన్నెలో 50 గ్రాములు పటిక వేసి ఇంటి పూజగదిలో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి..పటిక దివ్యౌషధం అన్ని రకాల మేలును చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news