కేదారేశ్వర గుహలో ఉన్న ర‌హ‌స్యాలు తెలిస్తే షాక్ అవుతారు…

-

కేదారేశ్వర గుహ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉన్న హరిశ్చంద్ర కోటకు కుడి వైపున ఉంది . ఇది ఒక అద్భుతమైన కట్టడం.పెద్ద బండరాయి కింద 12 అడుగుల శివలింగం రూపంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ గుహ లోపలి భాగంలో 4- 6 మంది భక్తులు కూర్చుని పూజ, ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఒక గది కూడా ఉంది. ఈ శివ లింగాన్ని భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండేటట్టు నిర్మించారు.


లింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉండేవి. వాటిలో 3 స్తంభాలు విరిగిపోగా ఒకటి మాత్రమే మిగిలింది. అయితే ప్రతి యుగం తర్వాత భయంకర ప్రళయం ఏర్పడుతుందని అటుపై మరుసటి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతాయి. ఇక్క‌డ విశేషం ఏమిటంటే, ఈ నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకి ప్రతీకలనీ, ఒక్కొక్క యుగాంతానికి ఒక్కొక్క స్తంభం విరుగుతూ, కలియుగానికి ఒకటే స్తంభం మిగిలిందని. ఎప్పుడైతే ఈ స్తంభం విరిగిపోతుందో, అదే కలియుగానికి ఆఖరు రోజనీ నమ్ముతారు.

అయితే విరిగిపోకుండా ఉన్న ఈ స్తంభం అంత పెద్ద రాతి బండను ఎలా మోస్తోందన్న విషయం అంతు చిక్క‌డం లేదు. అలాగే ఇక్కడ మ‌రో విషయం ఏమిటంటే, ప్రతిరోజు 4 గోడల నుండి నీరు గుహలోకి వస్తుంది. శివలింగం చుట్టూ వేసవి, శీతాకాలాలలో 5 అడుగుల ఎత్తులో చాలా చల్లని నీరు ఉంటుంది. కాని, వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకిరాదు, నిలవదు. ఈ విషయంపై కూడా పరిశోధనలు జరిగిన జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో భారత దేశంలో వుండడం మన ప్రాచీనుల విజ్ఞానానికి ప్రతీక.

Read more RELATED
Recommended to you

Latest news