సిద్దిపేట: ఆస్పత్రి పాలైన 9 మంది విద్యార్థులు

-

మధ్యాహ్న భోజనం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మిరుదొడ్డిలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 9 మంది అస్వస్థతకు గురయ్యారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని పురుగుల అన్నం, నీళ్ల చారుతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news