వరంగల్: ఒకే కుటుబంలో వరుసగా 4 మరణాలు

-

crimeవరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జ్ పెరికవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారతిమాయి అనే వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. భారతిమాయికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. 8 నెలల కిందట ఇద్దరు కుమారులు కరోనా రాక్షసి కోరల్లో చిక్కుకుని మృతి చెందారు. అప్పటి నుంచి భారతిమాయి తన మూడో కొడుకు కృష్ణ ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో గురువారం కృష్ణ అకస్మాత్తుగా మృతి చెందాడు. అది చూసి తట్టుకోలేక ఆ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. వరుస మరణాలతో ఆ కుటుంబం విషాదం నెలకొంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news