తెలంగాణ‌లో ఎన్‌కౌంట‌ర్ల మోత‌..

-

ఉద్య‌మాల గ‌డ్డ‌.. తెలంగాణ అడ్డ‌.. ఈ గ‌డ్డ‌పై నిజాం పాల‌న నుంచి నేటి వ‌ర‌కు నిత్యం పోరాటాలు జ‌రుగుతూనే ఉన్నాయి.. ఓ తెలంగాణ సాయుధ పోరాటం.. ఓ ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం.. మ‌హ‌త్త‌ర‌మైన రైతాంగ విప్ల‌వ గెరిల్లా పోరాటం.. ఇలా పోరాటాల‌కు కొదువ లేని తెలంగాణ‌.. తెలంగాణ గ‌డ్డ‌పై జ‌రిగే  ఏ పోరాటంలో అయినా.. నెత్తురు చింద‌డం అనవాయితీ.. నెత్తురు చింద‌ని పోరాటం లేదు.. అయితే ఇందులో న‌మ్ముకున్న ఆశ‌యాల కోసం పోరుబాట ప‌ట్టి ప్రాణాలు ఒదిలిన నేల ఇది. అయితే ఈ గ‌డ్డ‌పై మ‌హ‌త్త‌ర పోరాటాల‌ల్లో అసువులు బాసిన చరిత్ర క‌లిగిన ఈ నేల‌లో అప్పుడ‌ప్పుడు దుర్మార్గుల నెత్తురు కూడా చిందించిన నేల‌.

అయితే తెలంగాణ గ‌డ్డ‌పై ఐదు ఏండ్ల‌లో మూడు ఎన్‌కౌంట‌ర్లు కాగా, ఇందులో 11 దుర్మార్గుల‌ను తెలంగాణ పోలీసులు హ‌త‌మార్చారు. తెలంగాణ ప్రాంతంలో 11 మంది మోస్ వాంటెడ్ కేసుల్లో చిక్కుకున్న దుర్మార్గుల‌ను పోలీసులు హ‌త‌మార్చి చ‌రిత్ర సృష్టించారు. ఇందులో ఐదు సంవ‌త్స‌రాల్లో మూడు ఎన్‌కౌంట‌ర్లు కావ‌డం ఇందులో 11మంది ఎన్‌కౌంట‌ర్ల‌లో హ‌త‌మార్చారు. ఇందులో ప్ర‌ధానంగా ఓ క‌రుడు క‌ట్టిన తీవ్ర‌వాదితో పాటు, ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌ను ఎన్‌కౌంట‌ర్ చేసిన పోలీసులు, ఈ రోజు జ‌రిగిన దిశ నిందితులు న‌లుగురు ఉన్నారు. అయితే ఇందులో ఈ మూడు ఎన్‌కౌంట‌ర్ల నేప‌థ్యంలో చ‌నిపోయిన‌వారి గురించి ఓసారి లుక్కేద్దాం.

దేశంలోని అనేక నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వికారుద్దీన్‌ను 2014, ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసులను కాల్చి చంపిన ఘటనతో పాటు గుజరాత్ హోంమంత్రిపై దాడి ఘటనలో నిందితుడైన వికారుద్దీన్‌‌ను 2010 జూలై 15న విశాఖ నుంచి వరంగల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచీ కోర్టుకు తీసుకువెళ్లే ప్రతిసారీ పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు వికారుద్దీన్ ప్రయత్నిస్తూనే ఉండేవాడు.

నిందితులు పారిపోతుండగా ఎన్‌కౌంటర్ :
ఈ క్రమంలోనే 2015 ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులపై వికారుద్దీన్‌తో పాటు వికార్‌ అహ్మద్‌, సయ్యద్‌ అంజాద్‌ అలియాస్‌ సులేమాన్‌, ఇజార్‌ఖాన్‌, మహ్మద్‌ అనీఫ్‌, మహ్మద్‌ జకీర్‌ దాడికి యత్నించి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల ఆయుధాలు లాక్కుని వారిపైనే కాల్పులు జరిపేందుకు సిద్ధమైన వికారుద్దీన్ గ్యాంగ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. వరంగల్ జైలు నుంచీ హైదరాబాద్ తరలిస్తుండగా జనగామ దాటాక, ఆలేరు సమీపంలోని కాకతీయ తోరణం దగ్గర టాయిలెట్ కోసం వాహనం ఆపాలని ఉగ్రవాదులు అడిగారు. అక్కడే వారు పోలీసులపై దాడికి పాల్పడేందుకు యత్నించి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.

మరో ఎన్‌కౌంట‌ర్లో తెలుగు రాష్ట్రాల్లో అనేక భూ సెటిల్‌మెంట్లు, కబ్జాలు, హత్యలు చేస్తూ వేల కోట్ల రూపాయల సంపాదించిన‌ గ్యాంగ్‌స్టర్ నయీంను పోలీసులు 2016, ఆగస్టు 8న ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలోని మిలీనియం టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో నయీం తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పెద్దయెత్తున అక్కడికి చేరుకున్నారు. నయీం అనుచరులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపారు.

ఈ కాల్పుల్లో నయీం అక్కడికక్కడే చనిపోయాడు. నయీంపై వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్… దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్ల, బెదిరింపుల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో సజ్జనార్ కీలక పాత్ర పోషించడం విశేషం. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న సజ్జనార్ నయీంకు సంబంధించి పక్కా సమచారం రాబట్టి అతడిని ఎన్‌కౌంటర్‌లో కీలకపాత్ర పోషించారు.

ఇప్పుడు దిశ సంఘ‌ట‌న‌తో న‌లుగురు నిందితుల‌ను పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. దేశంలో నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అంతటి సంచలనం కలిగించిన దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద ‘దిశ’ను దహనం చేసిన చోటికి గురువారం అర్ధరాత్రి పోలీసులు నిందితులను తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆ నలుగురిని తుపాకీతో కాల్చిచంపారు.

తాజా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దిశ కేసును పర్యవేక్షిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్‌మీడియాలోనూ సాహో సజ్జనార్ కీర్తిస్తున్నారు. పోలీసులు చేసిన ఈ మూడు ఎన్‌కౌంట‌ర్ల‌లో ప‌ద‌కొండు మందిని ఐదేండ్ల‌లో హ‌తమార్చ‌డం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగిస్తుంది. ఇలాంటి ఎన్‌కౌంట‌ర్లు దేశంలో ఏనాడు అయిన సంచ‌ల‌న క‌లిగిస్తూనే ఉన్నాయి. అయితే ఇక్క‌డ ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్ర‌భుత్వం వెంట‌నే బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌ర‌గాలంటే ఎన్‌కౌంట‌ర్ చ‌ట్టం తేవాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news