నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. తాజాగా నోటిఫికేషన్ ని రిలీజ్ చేసి పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… దీనిలో మొత్తం 200 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఎంపికైన వాళ్ళకి నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు ఉంటాయి.

ఇక అర్హత విషయం లోకి వస్తే.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆయా పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఏఐసీటీఈ నుంచి అప్రూవల్ పొందిన లేదా యూజీసీ గుర్తింపు పొందిన కాలేజీల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు చేసి ఉండాలి. అలానే 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించారు గమనించండి.

మెకానికల్ ఇంజనీర్ విభాగంలో మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ లేదా మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ విభాగంలో 25 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. అంతే కాకుండా సివిల్ ఇంజనీర్ విభాగం లో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్ట్స్ కి అప్లై చేయవచ్చు.

ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగం లో మరో 25 ఖాళీలు వున్నాయి. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. అప్లై చేయడానికి ఏప్రిల్ 15 వరకు గడువు ఉంది. అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని చెప్పారు. రూ. 1180ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్లో కొన్ని వర్గాల వారికి మినహాయింపు కూడా వుంది. పూర్తి వివరాలని అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news