గుడ్ న్యూస్.. 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ లో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఈ ఖాళీలు వున్నాయి.

పోస్టుల వివరాలు చూస్తే.. ఎంవీ మెకానిక్‌, ఎంవీ ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, టైర్‌మ్యాన్‌ సర్వీస్ గ్రేడ్-సి పోస్టులు వున్నాయి. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారు 8వ తరగతి ప్యాస్ అయ్యి ఉండాలి. అలానే గుర్తింపు పొందిన టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి సర్టిఫికెట్ ని కలిగి ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అలానే తప్పక డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. ఇక దరఖాస్తు విషయానికి వస్తే.. అక్టోబర్‌ 19, 2022 వరకు సమయం వుంది. కనుక ఆలోగా అప్లై చేసుకోవచ్చు. సాలరీ విషయానికి వస్తే.. రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా ఇస్తారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడచ్చు.

దరఖాస్తు చేసేందుకు చిరునామా: The Senior manager (JAG), Mail Motor Services, No-37, Greams Road, Chennai-600006.

 

Read more RELATED
Recommended to you

Latest news