మరోసారి బరోడా జట్టుకు అంబటి రాయుడు

-

సీనియర్ క్రికెటర్, తెలుగుతేజం అంబటి రాయుడు దేశవాళీ క్రికెట్ లో మరోసారి బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2010లో ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు పన్నెండేళ్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు సేవలందించాడు. అయితే అంబటి రాయుడు ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, ఆంధ్ర, విధర్భలతోపాటు 2012 -14 మధ్య బరోడా తరపున బరిలోకి దిగాడు.

గత సీజన్ వరకు అంబటి రాయుడు ఆంధ్ర తరఫున ఆడాడు. గతంలో బరోడాకు ప్రాతినిధ్యం వహించిన 36 ఏళ్ల రాయుడు మరోసారి ఈ జట్టుకు ఆడాలని ఉందని బీసీఏను సంప్రదించిన నేపథ్యంలో ఈ మేరకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ (బిసిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శశిధర్ హట్టంగడి ధ్రువీకరించారు. కాగా అంబటి రాయుడు భారత జట్టుకు 55 వన్డేలు, 6 టి-20లో ప్రాతినిధ్యం వహించాడు.

Read more RELATED
Recommended to you

Latest news