Independence Day: ఇండిపెండెన్స్ డే గురించి మీకు తెలియని నిజాలు..!

-

Independence Day: ఆగస్ట్ 15, 1947.. భారతావని దాస్య శృంఖలాల నుంచి విముక్తి అయిన రోజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకుల ప్రబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజు. ఎందరో త్యాగమూర్తులు, ఎందరో పోరాటల ఫలితంగా మాతృభూమికి ఈ స్వతంత్రం దక్కింది. దాదాపు 200 ఏళ్ల వలస పాలనలో బానిసత్వంలో మగ్గిన దేశ ప్రజలకు విముక్తి దొరికింది.

75th Independence Day
75th Independence Day

ఈ ఆగస్టు 15 తో భారతనికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు పూర్తవుతుంది. 77వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు దేశం ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ డే గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలను తెలుసుకుందాం.. న్యూఢిల్లీలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో మహాత్మా గాంధీ పాల్గొనలేదు. ఆ సమయంలో ఆయన కలకత్తాలో ఉన్నారు. భారతదేశానికి, పాకిస్తాన్ కి మధ్య జరిగే వివాదాలకు బీజాలు కూడా ఈ రోజే పడ్డాయి.

ఆగస్టు 15, 1947న బంకించంద్ర చటర్జీ వందేమాతరం పాడిన తర్వాత భారత శాసనమండలి పనిచేయడం ప్రారంభించింది. అయితే ఆ రోజుకి జాతీయ గీతం ఇంకా లేదు. 1950లో జాతీయ గీతం ఆమోదించబడింది. మన జాతీయ పతాక మొదటి రూపాంతరాన్ని 1921లో స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు. ఈ జెండా మధ్య గీతపై 24 చుక్కల అశోక చక్రంతో ఆరెంజ్, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కలిగి ఉంది. ఇది జూలై 22, 1947న స్వీకరించి.. ఆగస్ట్ 15, 1947న ఎగరవేశారు.

Read more RELATED
Recommended to you

Latest news