లోక్‌సభలో మరోసారి BRS వాయిదా తీర్మానం

-

పార్లమెంటులో ఇంకా అదానీ-హిండెన్ బర్గ్ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు నిరసన చేస్తూనే ఉన్నాయి. లోక్‌సభలో హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్‌ చేశారు. పార్టీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.  తక్షణమే అదానీ వ్యవహారంపై చర్చకు అనుమతివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను దిగజార్చిన అదానీ గ్రూపు సంస్థల వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో వరుసగా 7 రోజులపాటు అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఆందోళన నిర్వహించారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చ కోసం రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, దిగువ సభలో బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షా నేత నామ నాగేశ్వరరావు మరోసారి వాయిదా తీర్మానాలకు పట్టుబట్టారు. ఈ నోటీసులను ఉభయ సభల్లో తిరస్కరించటంతో కేంద్రానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news