కేంద్రం కీలక నిర్ణయం….. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్.. ఈ ఆదివారం నుంచే ప్రారంభం

-

కరోనాపై పోరుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. ప్రైవేట్ టీకా కేంద్రాల్లో ఈ టీకాను ఇవ్వనున్నారు. 18 ఏళ్ల వయస్సు నిండిన వారు… రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి అయిన వారు ప్రైవేట్ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిన్ యాప్ లో నమోదు చేసుకున్న తరువాత స్లాట్ కన్ఫామ్ కానుంది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్లకు పైబడిన వారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చారు.

ఇప్పటికే దశల వారీగా వ్యాక్సినేషన్ ఇస్తూ వస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 2020 జనవరి 16న ప్రారంభించింది. జనవరి 16 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. 2020 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. 2020 ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2020 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. 2022 జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మార్చి 16 నుంచి  12-14 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news