తెలంగాణాలో మరో అధికార పార్టీ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్..

-

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత మేర తగ్గినట్టు కన్పిస్తోన్నా రోజూ వేయికి పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం విడుదల అయిన కరోనా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు సంఖ్య 80 వేలకు చేరువైంది. అయితే ఒకప్పుడు సామాన్యులకే పరిమితం అయిన కరోనా కేసులు ఇప్పుడు రాజకీయ నాయకులు, సినిమా నటులను కూడా వదలడం లేదు. ఇప్పటికే తెలంగాణాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకగా ఇప్పుడు తాజాగా ఒక ఎమ్మెల్సీకి కరోనా సోకింది.

తెలంగాణాలో మరో అధికార పార్టీ ఎమ్మెల్సీకి కరోనా పాజిటివ్ అని తేలింది. నిజామాబాద్ కు చెందిన శాసన మండలి సభ్యులు వీజీ గౌడ్ గా సుపరిచితం అయిన వి . గంగాధర్ గౌడ్ కు కరోనా సోకింది. ఆయనకే కాక ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ అని తేలింది. అలానే కుటుంబం మొత్తానికి పరీక్షలు చేయగా అందులో గన్ మెన్, డ్రైవర్, కోడలికి నెగెటివ్ అని తేలింది. దీంతో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హోం క్వారన్ టైన్ లోకి వెళ్లినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news