తెలంగాణా కరోనా…1,763 కేసులు, 8 మరణాలు !

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. నిన్న 1,682 కరోనా కేసులు నమోదు కాగా తాజా బులెటిన్ ప్రకారం 1,763 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 95,700కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కొద్ది సేపటి క్రితం బులిటెన్‌ విడుదల చేసింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 719కి చేరింది.

corona
corona

ఇక ఈ 24 గంటల్లో 1,789 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 73,991 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 20,990 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక హోం ఐసోలేషన్‌ లో 14,461 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 24,542 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,97,470 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఎప్పటిలానే అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 484, రంగారెడ్డి లో 166, మేడ్చల్లో 169 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news