కార్తీక “దీప దానం” చేస్తే కలిగే ఫలాలు.. దీపదానం అంటే??

-

షోడశదానాల్లో దీపదానం వల్ల విశేషమైనేది శాస్త్ర సమ్మతమైన విషయం.

కార్తీకం అంటే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం, ఇంట్లో దేవుని దగ్గర, తులసీ దగ్గర, ధాత్రీ అంటే ఉసరిక చెట్టు దగ్గర దీపం పెట్టడంతోపాటు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో దేవాలయం/ఇంటిపైన ఆకాశ దీపాన్ని పెట్టుకోవడం ప్రధానమైనవి. దీంతోపాటు ఈ మాసంలో దీప దానంతో చేస్తే విశేష ఫలితాలు వస్తాయని పురాణాల్లో ఉంది. దీపదానం అంటే వెండి,బంగారం, ఇత్తడి, ఉసరికాయ, పిండి, సాలగ్రామంతో సైతంగా ఇలా రకరకాలుగా ఇస్తారు. దీనివల్ల అస్థిరమైన శరీరంపై మమకారం పోవాలని అంటే నేను అనే అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తీక దీప దానం చేస్తారు. షోడశదానాల్లో దీపదానం వల్ల విశేషమైనేది శాస్త్ర సమ్మతమైన విషయం.

ఎన్ని దానాలు చేసినా దీప దానానికి సరిరావు. కార్తీక మాసంలో దీప దానం అన్నింటికంటే శ్రేష్ఠమైనది. దీప దానం చేసే ముందు పళ్లెంలో బియ్యం పోసి, మూడు కుందులు ఉంచాలి. వాటిలో ఆవు నూనెతో దీపారాధన చేయాలి. మూడు దీపాల్లో దూది వత్తులను మాత్రమే ఉంచాలి. మూడు ప్రమిదల చుట్టూ ఏడు ఉసిరికాయలను ఉంచాలి. వాటిపై నేతిలో తడిపిన నిలువు వత్తులను వెలిగించాలి. అనంతరం సంప్రదాయపరుడైన పూజ్యనీయుని అర్చించి, తగిన దక్షిణ తాంబూలంతో దానం ఇవ్వాలి. ముత్తైదువులకు కూడా దీప దానం ఇవ్వవచ్చు లేదా ఆలయంలో స్వామి సన్నిధానంలో లేదా ధ్వజ స్తంభం వద్ద దీపారాధన చేయడం కూడా దీప దానమే. ఎవరి శక్తిని బట్టివారు దీపదానం చేస్తే మంచిది. అజ్ఞాన తిమిరాన్ని పోగుట్టుకునేందుకు ఆధ్యాత్మిక సాధనకు ఈ ప్రక్రియ చేపడుతారని పండితులు చెప్తున్నారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news