2019 Roundup : టాలివుడ్ తెరపై సందడి చేసిన కొత్త హీరోయిన్లు…!

-

తెలుగు సిని పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త తరాన్ని తీసుకురావడానికి గాను ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా హీరోయిన్ల రూపంలో కొత్త వారు ఎప్పటికప్పుడు టాలివుడ్ కి పరిచయం అవుతూనే ఉన్నారు. ఈ ఏడాది కొంత మంది కొత్త హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఒకసారి వాళ్ళ లిస్టు చూస్తే…

శివాత్మిక:

ప్రముఖ హీరో రాజశేఖర్, జీవితా కుమార్తె శివాత్మిక ఈ ఏడాది హీరోయిన్ గా అడుగు పెట్టింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘దొరసాని’ సినిమాలో ఆమె నటించింది.

దివ్యాంశ కౌశిక్:

నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘మజిలీ’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్ తెలుగు తెర మీద మెప్పించింది. తన అందంతో హావ భావాలతో ఆమె నటన ఆకట్టుకుంది.

అనన్య :

పెళ్లి చూపులు సినిమాతో మెప్పించిన ప్రియదర్శి హీరోగా నటించిన ‘మల్లేశం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది అనన్య. ప్రస్తుతం పింక్ సినిమాలో నటిస్తుంది.

వాణి భోజన్:

విజయ్ దేవరకొండ నిర్మాణంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాతో హీరోయిన్‌గా వాణి భోజన్ నటించింది. కాస్త నటనతో ఆకట్టుకుంది.

అనఘా :

కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్ గా అడుగుపెట్టింది అనఘా.

సలోని మిశ్రా :

విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో సలోని మిశ్రా హీరోయిన్ గా అడుగు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news