ఫ్యాక్ట్ చెక్: రూ.36,500 కడితే.. మూడు లక్షలు వస్తాయా..?

-

నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి కనబడుతుంటాయి. నిజానికి ఇలాంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

సోషల్ మీడియాలో ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగుల వరకు ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి కనపడుతూ ఉంటాయి. తాజాగా ఒక స్కీమ్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడు లక్షల రూపాయలని ముద్ర యోజన స్కీం కింద పొందచ్చని ఆ వార్తలో ఉంది.

అయితే దీని కోసం రూ.36,500 ని కట్టాలని లీగల్ ఇన్సూరెన్స్ చార్జీలు కింద వీటిని కట్టాలని ఆ లెటర్ లో రాసి ఉంది. మరి ఇంతకీ ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. అయితే దీని పై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది. దీనిలో నిజం లేదు అని ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పింది. కనుక అనవసరంగా దీన్ని నమ్మి మోసపోవద్దు. ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news