మనం సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త ని చూస్తూనే ఉంటాం. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సింది మనమే. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం.
అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే మరి ఇక తాజాగా ఒక వార్త వచ్చింది. మరి అది నిజామా కాదా..? దానిని నమ్మచ్చా లేదా అనేది చూద్దాం. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎక్సైజ్ మినిస్ట్రీ తాజాగా ఒక అపాయింట్మెంట్ లెటర్ ని ఇచ్చారు.
An appointment letter issued by 'Excise Ministry' claims that the applicant has been appointed for the post of Field Distribution Officer & is asking for an application fee.#PIBFactCheck
▶️This claim is #FAKE.
▶️There is NO 'Excise Ministry' under the Government of India. pic.twitter.com/OwuyMbWjDu
— PIB Fact Check (@PIBFactCheck) April 20, 2022
ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ పోస్ట్ కి ఎంపికయ్యారని… అప్లికేషన్ ఫీజు చెల్లించాలని అందులో ఉంది. నిజంగా ఎక్సైజ్ మినిస్టరీ ఈ అపాయింట్మెంట్ లెటర్ ను జారీ చేసిందా ఉద్యోగస్తులు ఎంపిక చేసిందా..? ఫీజు కట్టాలా..? ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఎక్సైజ్ మినిస్టరీ ఎలాంటి అపాయింట్మెంట్ లెటర్ ను జారీ చేయలేదు.
ఆ మెసేజ్ కనుక వచ్చిందంటే నమ్మకండి. పైగా అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించద్దు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఎలాంటి ఎక్సయిజ్ మినిస్ట్రీ లేదు ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మకండి. ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పేసింది. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తల్ని నమ్మొద్దు అలానే వాటికి దూరంగా ఉంటేనే బెస్ట్.