బిగ్ బ్రేకింగ్: ఐపిఎల్ కు రోహిత్ శర్మ దూరం… కెప్టెన్ గా సూర్య ?

-

ఐపిఎల్ 2023 సీజన్ 16 మరో రెండు రోజుల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఒక చేదు వార్త వినాల్సి వస్తోంది. గత కొన్ని సీజన్ లుగా ముంబై ను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తూ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపిన సమాచారం మేరకు ప్రస్తుతం ఇండియా వన్ డే మరియు టెస్ట్ జట్లకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తుండటంతో, 2023 వ సంవత్సరంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మరియు వన్ డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని అన్ని విధాలుగా సిద్దంగా ఉండడం కోసం ఐపిఎల్ లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడట. దూరం కానున్న మ్యాచ్ లకు ఇండియా స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా చేయనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news