ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌..గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా

-

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌. ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా పడింది. ఏప్రియల్ నెల 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్ వన్ మెయిన్స్ ని జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వ తేధీ వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది ఏపీపీఎస్సీ.

2022 సివిల్స్ ఫేజ్ – 3 ఇంటర్వ్యూలు ఏప్రియల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేసినంది ఏపీపీఎస్సీ. ఇంటర్వ్యూల షెడ్యూల్ ని నిన్న విడుదల చేసింది యుపిఎస్సీ.
యుపిఎస్సి సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్ధులు హాజరవుతున్నారు. సివిల్స్ ఇంటర్వ్యూల కారణంగా మెయిన్స్ ని జూన్ లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో నిరుద్యోగులకు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news