భర్త ఇంటికి రావడం లేదని హైదరాబాద్‌లో క్షుద్రపూజలు చేసిన భార్య

-

భర్త ఇంటికి రావడం లేదని అత్తింటి ముందు ధర్నాలు చేసిన భార్యలు ఉన్నారు, ఆఖరికి ఆత్మహత్యాయత్నం చేసిన వాళ్లూ ఉన్నారు. కానీ భర్త ఇంటికి రావడం లేదని క్షుద్రపూజలు చేసిందా ఆ భార్య. గిట్టని వాళ్లు, లేదంటే ఎవరైనా శత్రువులు, పడని వాళ్లను భయపెట్టడానికి లేదంటే వాళ్లకు కీడు జరగాలనే ఉద్దేశంతో క్షుద్ర పూజలు చేసినోళ్లు ఉన్నారు. కట్టుకున్న భర్తమీదే పూజలు చేసింది.

హైదరాబాద్‌లో ఓ మహిళ స్వయంగా తన భర్త కోసమే క్షుద్రపూజల తరహాలో ఓ కవర్‌లో పూజ సామాన్లు పెట్టి తాము నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలో గొయ్యి తొవ్వి అందులో పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. కంచన్‌బాగ్‌లోని హఫీజ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే ఇదంతా మహిళ ఎందుకు చేసిందని ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. భర్త రోజూ ఇంటికి రావడం లేదని అతని రాక కోసం భార్య ఇదంతా చేసింది. స్థానికులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అయింది. విషయం పోలీసుల వరకు చేరడంతో క్షుద్రపూజలు చేసిన మహిళతో పాటు ఆమెకు సహాకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భర్త ఇంటికి రాకపోతే ఏ భార్య అయినా బంధువులకు, లేదంటే పెద్దలతో చెప్పుకొని తన కాపురాన్ని సిరిదిద్దుకుంటుంది. అయినా మారకపోతే పోలీస్ కంప్లైట్ ఇవ్వడమో పంచాయితీ పెడతారు. హైదరాబాద్ కంచన్‌బాగ్‌ పరిధిలోని హఫీస్‌నగర్‌లో హజీరా అనే మహిళ భర్త ఇంటికి రావడం లేదని క్షుద్ర పూజలు చేయించింది. ఓ బాబా సహాయంతో క్షుద్రపూజలు, చేతబడులకు ఉపయోగించే పూజ సామాన్లను ఒక కవర్‌లో కట్టి దాన్ని తమ ఇంటి సమీపంలో చిన్న గొయ్యి తొవ్వి దాంట్లో పెట్టబోయింది. హజీరా పట్టపగలే రోడ్డు పక్కన గొయ్యి తొవ్వి అందులో కవర్ పెట్టడం చూసిన స్థానికులు సీక్రెట్‌గా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఆమెను పట్టుకున్నారు.

ఇదంతా చేస్తుండగా ఆమె పక్కన ఓ బాలిక కూడా ఉంది. వీడియో తీసిన స్థానికులు విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో వారు బురఖాతో వచ్చి పూజ సామాన్లు పాతిపెట్టడానికి వచ్చిన మహిళను అదుపులకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఈ క్షుద్రపూజల సలహా ఇచ్చిన బాబాను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news