ఓరి మీ దుంపలు తెగ.. ట్రెయిన్‌నే వెయిట్ చేయించారు కదరా..!

-


సాధారణంగా రైల్వే గేటు దగ్గర ట్రెయిన్ వెళ్తుంటుంది. గేటు పక్కన రోడ్డు మీద వాహనాలు ఆగి ఉంటాయి. ట్రెయిన్ ఎప్పుడు పోతుందా.. గేట్ ఎప్పుడు తెరుచుకుంటుందా.. ఎప్పుడు వెళ్లాలా అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు వాహనదారులు. కానీ.. ఈ వీడియో చూడండి. మొత్తం రివర్స్‌లా ఉంది వ్యవహారం. ఏకంగా ట్రెయిన్‌నే వెయిట్ చేయించారు ఈ వాహనదారులు. ట్రెయిన్‌ను వెళ్లనీయకుండా రైల్వే గేటు నుంచి వాహనదారులు వెళ్తూనే ఉన్నారు. ట్రెయిన్‌కు అస్సలు దారి ఇవ్వలేదు. దీంతో ట్రెయిన్ లోకో పైలెట్, గ్యాంగ్ మెన్ ట్రెయిన్ దిగి వాహనదారులను సర్ది చెప్పినా ఎవ్వరూ వినలేదు. చివరకు ట్రెయిన్‌ను కాస్త ముందుకు కదిలించే సరికి వాళ్లంతా ఆగిపోయారు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ట్రెయిన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జనాలకు మరీ ఇంత అర్జెంట్ ఏముంటుంది. ట్రెయిన్‌ను కూడా వెళ్లనీయకుండా.. ప్రమాదమని తెలిసినా.. ఏమాత్రం పట్టించుకోకుండా అలా ట్రెయిన్‌ను ఆపి మరీ గేట్ దాటడమేంది. నిన్నగాక మొన్ననే కదా అమృత్ సర్‌లో ట్రెయిన్ యాక్సిడెంట్ జరిగి ఉత్తి పుణ్యానికి 62 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అబ్బే.. ఈ జనాలకు బొత్తిగా చావంటే భయం లేనట్టుందే.. అంటూ నెటిజన్లు తెగ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news