బీర్లు తాగి రచ్చ రచ్చ చేసిన పంది… మత్తులో ఆవుతో ఫైట్.. వైర‌ల్ వీడియో

-

ఇది 2013లో జరిగిన ఘటన. కానీ.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది. ఓ పెంపుడు పంది… ఓ క్యాంప్ సైట్ వద్ద రచ్చరచ్చ చేసింది. పోర్ట్ హెడ్ లాండ్ వద్ద క్యాంపుకు వచ్చిన కొందరు.. తమ వెంట బీర్ల టిన్స్ ను తీసుకెళ్లారు. అయితే… కొన్ని తాగి.. మరికొన్నింటిని బయటే వదిలేసి తమ గుడారాల్లోకి వెళ్లి నిద్రపోయారు.

అంతే.. కొంత సేపటికి ఓ పంది.. అక్కడికి వచ్చి అక్కడ ఉన్న బీర్ల టిన్స్ ను మొత్తం తాగేసింది. బయట సౌండ్ వస్తున్నదని గమనించిన వాళ్లు.. పంది బీర్లు తాగడాన్ని గమనించారు. అప్పటకే అది 18 బీర్లను లాగించేసింది. అన్ని బీర్లను తాగిన పంది… ఏదో ఒకటి తినాలని చెప్పి అటూ ఇటూ చూసింది. తిండి కోసం వెతికింది. కానీ.. దానికి ఏం దొరకలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోయి ఆవుపై పోరాటానికి దిగింది. తాగిన మత్తులో రచ్చరచ్చ చేసింది. ఆవుపై పరిగెత్తించింది. అలిసి పోయి మత్తు దిగాక వెళ్లి ఓ చోట రెస్ట్ తీసుకుంది పంది. ఆ పంది కొంచెం డిఫరెంట్ గా ఉందట. క్యాంప్ కు వచ్చిన వాళ్లు.. తర్వాత అది విశ్రాంతి తీసుకుంటుండగా.. దాని ఫోటో తీశారు. దాని ముఖం, చెవుల మీద వింతగా గీతలు ఉన్నాయట. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news