ప్రారంభోత్సవం రోజే కూలిన వంతెన.. వీడియో వైరల్‌

-

ఫోన్‌ కొన్నరోజే సిమ్‌కార్డ్‌ పోయినట్లు..బ్రిడ్జిను ప్రారంభించిన రోజే అది కూలిపోయింది. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లు వేసి అది ప్రారంభించే రోజు అదే రోడ్డు మీద కొబ్బరికాయ కొడితే..ఆ. దెబ్బకి రోడ్డు పగిలిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బ్రిడ్జి నిర్మించి ప్రారంభించబోతే.. అప్పుడే కూలిపోయింది. ఎన్నో ఎళ్లగా బ్రిడ్జి లేక కష్టాలు పడిన ఆ ఊరి ప్రజలు.. ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే సరికి సంతోషపడ్డారు.

ఎంతో వ్యయంతో నిర్మించిన ఆ వంతనె ప్రారంభోత్సవానికి అధికారులు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.. కానీ, బ్రిడ్జి ప్రారంభోత్సవంలోనే అపశృతి చోటుచేసుకుంది. అలా రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారో లేదో..ఇలా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వంతెన. దాంతో అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. తమ వంతెన ఆశలు ఆవిరైనట్టేనా అనుకుంటూ అధికారుల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఒక వంతెనను ప్రారంభించేందుకు అధికారులు గుమిగూడడంతో కూలిపోయిందని స్థానిక ఖామా ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నిర్మాణ నాణ్యతపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఈ చిన్న వంతెనను నిర్మించారు. వంతెనకు ముందు ఉన్న తాత్కాలిక నిర్మాణం తరచుగా విరిగిపోయేదని వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది. కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్‌ను ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వ అధికారి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆ..అధికారి అలా రిబ్బన్ కట్ చేసిందో లేదో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది.

బ్రిడ్జ్ కిందికి పడిపోతుందని పసిగట్టిన అధికారులు సదరు మహిళ అధికారిని ముందుకు పక్కకు తీసుకువెళ్లారు. దాంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ..తరువాత సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇదంతా అక్కడి మీడియా, స్థానికులు ఫోటోలు, వీడియోలు తీశారు. దాంతో ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

కాంట్రక్టర్ల నిర్లక్ష్యమో, నిధుల లేమి తెలయదు కానీ..,ఈ మధ్య ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news