పరమాన్నం “జగ్గెరి రైస్‌ పాయసం” తయారీ విధానం

-

కావలసినవి :
బియ్యం : అరకప్పు
సగ్గుబియ్యం : పావు కప్పు
పాలు : లీటరు
బెల్లం : కప్పు
నెయ్యి : 1 టీస్పూన్‌
యాలకులపొడి : అర టీస్పూన్‌
జీడిపప్పు : కప్పు
నీరు : పావు కప్పు

తయారీ :
ముందుగా బెల్లాని నీటిలో కరిగించాలి. తర్వాత పాలను వేడి చేయాలి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేయాలి. కొంచెంసేపు తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేయాలి. చిన్నమంట పెట్టుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం సిరప్‌ కలిపి కొంచెంసేపు తర్వాత దించేయాలి. ఈలోపు పాన్‌పై నెయ్యివేసి జీడిపప్పుని దోరగా వేయించాలి. జీడిపప్పు, యాలకులపొడిని అన్నంలో కలిపి టేస్ట్‌ చేస్తే పరమాన్నం అదిరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news