చెప్పులు వేసుకోకుండా ఇసుకలో నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

-

పొద్దున్న నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తుంటాం. కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటుంటారు. ఒక్క డైనింగ్ టేబుల్ పై తప్ప అంతా చెప్పులు వేసుకునే ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే సంబంధం తెగిపోతుంది. మనుషులైన మనకి ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికి పెద్దగా తేడా ఏమీ లేదు. అవి కూడా మనలాగే ప్రాణంతో ఉన్న జీవరాశులే.

మిగతా జీవరాశులన్నీ ప్రకృతిలో భాగంగా జీవిస్తాయి. మనిషి ఒక్కడే ప్రకృతి నుండి విడివడుతున్నాడు. తద్వారా ఎన్నో సమస్యలని కొని తెచ్చుకుంటున్నాడు. మట్టి మీద నడిస్తే ప్రకృతిలో మనిషికి ఉన్న సంబంధం గుర్తుకు వస్తుంది. మనసు ఉత్సాహంగా తయారవుతుంది. ఒక్కసారిగా కాళ్లలో శక్తి తిరిగివస్తుంది.

అందుకే ప్రకృతి వైద్యంలో రోజూ కనీసం 10నుండి 15నిమిషాల పాటయినా చెప్పులు లేకుండా ఇసుకలో నడవమని చెబుతుంటారు. చెప్పులు లేకుండా నడవమన్నారని తారు రోడ్ల మీద, సిమెంటు రోడ్ల మీడ నడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ భూమితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి.

ఇలా నడవడం వల్ల బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. నొప్పులు తగ్గుతాయి. భూమిలో ఉండే ప్రత్యేక విద్యుత్ శక్తి కారణంగా మన శరీరంలోకి కొన్ని కణాలు పాస్ అవుతుంటాయి. దానివల్ల శరీరంలో నొప్పులు తగ్గిపోతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. చెప్పులు లేకుండా భూమి మీద నడవడం వలన భూమిపై ఉండే శక్తివంతమైన సూక్ష్మ జీవులు మన గోర్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పల్లెటూళ్లలో ఉండేవారికి ఎక్కువ రోగనిరోధక శక్తి ఉండడానికి ఇది కూడా ఓ కారణమే.

ఇది మంచి ఆక్యుప్రెషర్ లాగా పనిచేసి, శరీరానికి మంచి పాజిటివ్ శక్తిని అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news