అతి మధురం పొడితో అందం, ఆరోగ్యం రెండూ సొంతం..ప్రయోజనాలివే..!

-

ఆయుర్వేదంలో ఎంతటి సమస్యకైన పరిష్కారం దొరుకుతుంది. ఎన్నో మూలికలు ఉన్నాయి.. మనకు తెలిసినవి కొన్నే..! అతిమధురం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అనేక ఔషధ గుణాల కలయిక అతి మధురం. ఇది అత్యంత శక్తివంతమైన మూలిక. ఆయుర్వేద మందుల తయారీలో ఈ మొక్క వేర్ల చూర్ణాన్ని వాడతారు. అతిమ‌ధురాన్ని ములేటి పొడి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఈ మొక్క ఉపయోగాలేంటో చూద్దాం..!

ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను నివారించ‌డంలో అతి మ‌ధురం అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.
మన శరీరానికి అత్యవసరమైన గ్లూకోజ్,ఫక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు అతిమధురం మూలికలో ఉన్నాయి.
స్త్రీ శరీరానికి ఎంతో కీలకమైన ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కూడా అతిమధురంలో సమృద్ధిగా ఉన్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది.
నోటి దుర్వాస‌న‌, నోటి పూత‌, దంతాల నొప్పి, చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ దూరం చేయటంలో తోడ్పడుతుంది.

ఇలా కలుపుకుని తాగితే..

మ‌రిగించిన నీటిలో అతిమ‌ధురం చూర్ణం వేసి క‌లిపి పేస్ట్‌లా చర్మపై రాస్తే ద‌ద్దుర్లు, దుర‌ద‌లు, ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి.

అతి మ‌ధురం చూర్ణం, రోజ్ వాట‌ర్‌, తేనెల‌ను తీసుకుని క‌లిపి ఫేస్ ప్యాక్‌లా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని గంట సేపు అయ్యాక క‌డిగేయాలి. ఇలా త‌రచూ చేస్తుంటే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి.

ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ అతి మ‌ధురం పొడి, నాలుగు తుల‌సి ఆకులు, దంచిన చిన్న అల్లం ముక్క‌, అర స్పూన్ సోంపు వేసి బాగా మ‌రిగించాలి. ఆపై ఫిల్ట‌ర్ చేసుకుని తీసుకుంటే జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెరుగుతుందట. ఈ వైరస్‌ రోజుల్లో రోగ నిరోధక శక్తి ఎంత ముఖ్యమో మనందరికీ బాగా తెలుసు..

గ్లాస్ పాల‌ల్లో ఒక స్పూన్ అతి మ‌ధురం పొడి క‌లిపి తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు దృఢ పడ‌తాయి. సంతాన స‌మ‌స్య‌లు ఉంటే న‌యం అవుతాయి.

మతిమరుపుతో బాధపడుతున్నప్పుడు, ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతున్నప్పుడు అతిమధురంకి సరస్వతి ఆకు, పటికబెల్లంను సమపాళ్ళలో కలిపి దాన్ని అరకప్పు పాలలో నిత్యం తీసుకుంటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు ఏకాగ్రత కూడా చక్కగా కుదురుతుంది.

అతి మధురం చూర్ణంలో వస చూర్ణం కలిపి పూటకు పావు టీస్పూన్‌ చొప్పున మూడు పూటలా తగినంత తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతో దగ్గు తగ్గుతుంది.

నీరసం, ఆయాసం, గుండెదడ ,మలబద్దకం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎండు ద్రాక్షని, అతి మధుర చూర్ణాన్ని సమాన మోతాదులో కలిపి బాగా దంచి ముద్దగా చేసి చిన్న చిన్న గోలీలుగా చేసుకుని పాలతో పాటు క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు తీసుకుంటే బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

అరకప్పు పాలలో అర టీస్పూన్‌ మోతాదులో అతి మధురం చూర్ణాన్ని కలిపి సేవిస్తుంటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అతి మధుర చూర్ణంతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా మారుతాయి. పిప్పి పళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. చిగుళ్ల నుంచి రక్త స్రావం తగ్గుతుంది. నోట్లో ఉండే పుండ్లు, పొక్కులు తగ్గుతాయి.

అతి మధురం, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూను చూర్ణం, ఒక టీస్పూను పటికబెల్లం పొడి, నెయ్యి, తేనె కలిపి రోజుకు ఒకటి రెండుసార్లు తాగితే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుందట.

మూత్ర విస‌ర్జ‌న చేస్తున్న స‌మ‌యంలో మంట‌గా అనిపిస్తే ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా అతి మ‌ధురం చూర్ణం, యాల‌కుల పొడి, తేనెల‌ను వేసి క‌లిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న అతిమధురం పొడి మీకు కావాలనుకుంటే..ఆయుర్వేదం షాపుల్లో అడిగిచూడండి. అయితే ఆయుర్వేదంలో ఏ మూలికను అయినా కరెక్టు మోతాదులోనే వాడాలి. మంచిది కదా అని ఎక్కవగా వాడొద్దు..!

Read more RELATED
Recommended to you

Latest news