ద్రాక్ష, నారింజ రసం తాగుతూ ట్యాబ్లెట్లు వేసుకోవద్దు.. ఎందుకంటే..?

-

ఈరోజుల్లో డైలీ ఏదో ఒక సమస్యతో టాబ్లెట్ వేసుకునేవారు ఉన్నారు. అయితే అందరూ టాబ్లెట్ వేసుకుంటూ..ఏదో ఒక జ్యూస్ తాగుతుంటారు. ఆ చేదును మింగలేక ఇా చేస్తుంటారు. అయితే ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. అసలు ఔషధాలు ఎప్పుడూ పండ్ల రసాలతో కలిపి తీసుకోకూడదని మీకు తెలుసా.? ఒకవేళ మీకు కానీ ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి..ఎందుకంటే జ్యూస్‌తో పాటు ట్యాబ్లెట్లు వేసుకుంటే వాటి ప్రభావం తగ్గే అవకాశాలున్నాయి.
జ్యూసులతో పాటు టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఒక్కోసారి అలర్జీ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఔషధాలతో పాటు ముఖ్యంగా ద్రాక్ష, నారింజ, ఆపిల్ జ్యూస్‌లతో తీసుకోకూడదు. ద్రాక్ష రసం రక్తప్రవాహంలోకి వెళ్లి ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.. అందుకే రక్తపోటు, గుండె వ్యాధులు ఉన్నవారు ద్రాక్ష రసంతో పాటు ట్యాబ్లెట్లు వేసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
నారింజ, యాపిల్, ద్రాక్ష రసాలతో క్యాన్సర్ మందులని తీసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుందని ఒక పరిశోధనలో వెల్లడైంది. . ద్రాక్ష రసంతో ఔషధం తీసుకున్న తర్వాత సగం ఔషధ ప్రభావమే ఉంటుంది. రసాలు ఔషధం శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఔషధాలను నీటితో తీసుకోవడమే మేలు. అంతేకాదు సురక్షితం కూడా. కొద్దిపాటి నీళ్లతో ట్యాబ్లెట్లు వేసుకుంటే అవి శరీరంలో సరిగా కరగదు. అందుకే ఎక్కువ నీటితో తీసుకుంటే అవి సులభంగా కరిగిపోతాయి.
అలా అని చల్లటి నీటితో ఔషధాలను తీసుకోవడం కూడా మంచిదికాదని గుర్తుంచుకోండి. చల్లటి డ్రింక్స్‌తో ట్యాబ్లెట్లు తీసుకున్నవారిలో అవి విచ్ఛిన్నం కావడానికి సుమారు 40 నిమిషాలు పడుతుందట. అంటే అది గది ఉష్ణోగ్రత కలిగిన నీటితో తీసుకునే మాత్ర విచ్ఛిన్నత కంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. మనం మింగే మాత్రలు కాలేయం గుండా వెళ్తుంది. రక్త ప్రవాహంలోకి ప్రవేశించే ముందు కడుపులోని ఆమ్లాల ద్వారా విచ్ఛిన్నమవుతుంది. అదే కూల్ డ్రింక్స్, లేదా కూల్ వాటర్‌తో టాబ్లెట్ మింగితే ఆమ్లాలతో కలిసే ప్రక్రియ ఆలస్యమవుతుంది.
కాబట్టి జ్యూసులతో, చల్లటి నీళ్లతో టాబ్లెట్ వేసుకునే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. నార్మల్ వాటర్ తోనే టాబ్లెట్ వేసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news