జలుబు, దగ్గు ఉంటే పెరుగు తినకూడదా?

-

జలుబు, దగ్గు సమస్యలు వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి వస్తుంటాయి. ప్రతి చిన్నవాటికీ వైద్యుడుని సంప్రదించాలంటే కష్టం. ఇలాంటి సమయంలో పెరుగు తింటే సమస్య అధికమవుతుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి అపూహలన్నీంటినీ పక్కన పెట్టండంటున్నారు నిపుణులు.

1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానికి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

2. గొంతులో ఇబ్బందిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కొంచెం నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో వెంటే ఉపశమనం లభిస్తుంది. తేనెను నేరుగా తీసుకుంటే సాంత్వన లభిస్తుంది.

3. పైనాపిల్ పండు తినడం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది. ఈ పండులో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైము దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగించి గొంతు గరగరను తగ్గిస్తుంది.

4. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు చెంచా ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేసిన వెంటనే ఎంతో మార్పు కనిపిస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ నీటిని తాగాలి. అల్లం టీని తరచు తీసుకోవడం వల్ల కూడా గొంతుకు సాంత్వన లభిస్తుంది.

5. పుదీనా ఆకుల మాదిరిగా ఉండే పిప్పర్‌మెంట్ ఆకులు కూడా దగ్గుని తగ్గిస్తాయి. వేడి నీటిలో కొన్ని చుక్కల పిప్పరమెంట్ నూనె వేసి ఆవిరి పట్టించాలి. ఇలా చేయడం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news