నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో.. మగవారికి ఇంకా ఎక్కువే..

-

నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది మన భారతీయులు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు.. మన దేశ సాంప్రదాయానికి ఇది చిహ్నంగా ఉంటుంది.. అయితే, చాలా మంది దీనిని ఫ్యాషన్‌లో భాగంగా భావిస్తారు. కానీ బొట్టు పెట్టుకోవటం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.. నుదిటిపై బొట్టుపెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, మగవారికి కూడా బొట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని అజ్ఞా చక్రం అంటారు. ఆజ్ఞా చక్రం మానవ శరీరం ఆరవ, అత్యంత శక్తివంతమైన చక్రంగా పరిగణిస్తారు. ఈ మూలకాన్ని రోజులో చాలాసార్లు నొక్కడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనం సూచించినప్పుడు ఆ స్థలం ప్రెస్ అవుతుంది.ప్రతిరోజూ బొట్టు పెట్టుకోవటం వల్ల నుదిటి మధ్య భాగాన్ని నొక్కుతాము. ఇది తల, కళ్ళు, మెదడు, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపితం చేస్తుంది. రోజుకు చాలా సార్లు బొట్టు ప్రదేశంలో ప్రెస్‌ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అందువల్ల బొట్టు పెట్టుకోవటం కేవలం మహిళలకే కాదు, మగవారికి కూడా ప్రయోజనకరం. పురుషులు బిందీ ధరించనప్పటికీ వారు ప్రతిరోజూ ఆజ్ఞ చక్రంపై కుంకుమ తిలకం పెట్టుకోవచ్చు…

నుదుటి పై వలయాకారంగా బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది. తలనొప్పి తగ్గిపోతుంది. సైనస్ సమస్య తొలగిపోతుంది. దృష్టి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా ఉంటుంది. డిప్రెషన్ నుండి దూరంగా ఉంచుతుంది. వినికిడి మెరుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మైగ్రేన్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. నుదుటి పైన బొట్టు పెట్టుకొని నిండుగా కనిపించడం లక్ష్మీ దేవికి చాలా ఇష్టం.. అనుగ్రహం కూడా లభిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news