ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు..

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 గంటల పాటు ప్రయాణించే వారికి వెసులుబాటును కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల టీ-24 టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. కొత్తగా సీనియర్‌ సిటిజన్లకు టీ-24 టికెట్‌లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే ఆ టికెట్‌ను అందించనుంది.60 ఏళ్లు పైబడిన వారికే టీ-24 టికెట్‌లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్‌ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్‌ సిటిజన్లు తమ ఆధార్‌ కార్డ్‌ ను బస్‌ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుందని, సవరించిన ధరలు ఈ నెల 27 నుంచే అమలులోకి వస్తాయని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో టీ-24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకురాగా ఆ టికెట్‌ను కొనుగోలు చేసే ప్రయాణికులు సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్‌ ధరను రూ.120గా నిర్ణయించి అమలు చేయగా ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత టీ-24ని 100కి తగ్గించింది. తాజాగా సాధారణ ప్రయాణికులకు టీ-24 టికెట్‌ ధరను రూ.90కి, సీనియర్‌ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Provide concessions to senior citizens in RTC buses

టీ-24 టికెట్‌కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడు పోతున్నాయని వారు తెలిపారు. నగరం పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్‌ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు, సీనియర్‌ సిటీజన్ల కోసం టీ-6 టికెట్‌ను ఇటీవల ప్రారంభించామని, రూ.50కి ఆ టికెట్‌ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్‌-24 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో తీసుకువచ్చిన టీ-24, టీ-6, ఎఫ్‌-24 టికెట్లను కొనుగోలు చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. టీఎస్‌ ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు మరో తీపి కబురును అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news