పోలియో సోకిన బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్

-

KTR assures of treatment to polio affected boy

పోలియో సోకిన ఓ బాలుడికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రామగుండానికి చెందిన శివసాయి అనే బాలుడికి పోలియో సోకింది. దీంతో బాలుడు కుర్చీకే పరిమితమయ్యాడు. నడవకలేకపోతున్నాడు. వాళ్ల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చికిత్స చేయించలేకపోవడంతో.. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ద్వారా బాలుడి పేరెంట్స్ కేటీఆర్‌ను కలిశారు. దీంతో బాలుడికి అవసరమైన ట్రీట్‌మెంట్ ఖర్చును తానే భరిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో బాలుడికి శుక్రవారం పరీక్షలు జరిపారు. వచ్చే నెలలో శస్త్రచికిత్స చేసి బాలుడు నడిచేలా చేస్తామని డాక్టర్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news