పోలియో సోకిన ఓ బాలుడికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రామగుండానికి చెందిన శివసాయి అనే బాలుడికి పోలియో సోకింది. దీంతో బాలుడు కుర్చీకే పరిమితమయ్యాడు. నడవకలేకపోతున్నాడు. వాళ్ల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చికిత్స చేయించలేకపోవడంతో.. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ద్వారా బాలుడి పేరెంట్స్ కేటీఆర్ను కలిశారు. దీంతో బాలుడికి అవసరమైన ట్రీట్మెంట్ ఖర్చును తానే భరిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో బాలుడికి శుక్రవారం పరీక్షలు జరిపారు. వచ్చే నెలలో శస్త్రచికిత్స చేసి బాలుడు నడిచేలా చేస్తామని డాక్టర్లు తెలిపారు.
పోలియో సోకిన బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
ఇండియాలోనే సంపన్న మహిళ.. 84,000 కోట్ల ఆస్తికి అధిపతి..ఎవరో తెలుసా..?
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు, ఎంతైనా సంపాదించగలరు అని నిరూపించిన వాళ్లు...
బిడ్డ పుట్టాక ఉద్యోగం మానేసిన మహిళ.. ఇప్పుడు వ్యాపారం చేస్తూ లక్షల్లో సంపాదిస్తోంది..!!
ఆడపిల్లలు ఎంత చదువుకున్నా.. ఉద్యోగం చేయడానికి ఎన్నో సమస్యలు అడ్డం వస్తాయి.....
రైతు కుటుంబం కాదు.. అయినా వ్యవసాయం చేస్తూ 22 లక్షలు సంపాదించిన యువతి
పురుషాధిక్య దేశంగా ఉన్న భారత్లో మహిళలు మెల్లమెల్లగా వృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు...