వైరల్ వీడియో: సాయిబాబా పాదాల వద్దే ప్రాణాలు విడిచిన భక్తుడు..

-

జీవితం చాలా చిన్నది.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. చావు కూడా అంతే.. మనం చాలా సార్లు చూశాం.. స్టేజ్‌ మీద డ్యాన్స్‌ వేస్తూ సడన్‌గా కిందపడిపోయి చనిపోవడం.. నాటకాలు వేస్తూ అలానే అందరిముందు చనిపోవడం.. అలాంటి ఘటనలు చూసినప్పుడు చావు ఎంత నిరాడంబరంగా వచ్చి మనిషి ప్రాణాన్ని తీసుకెళ్లిపోతుంది అనిపిస్తుంది కదూ..! అలాంటి ఓ ఘటనే ఇప్పుడు జరిగింది. దేవుడి గుడికి వెళ్లి ఆ బాబా పాదాల మీద పడ్డాడు ఓ వ్యక్తి.. అలానే చనిపోయాడు..ఈ విజువల్‌ సీసీ టీవీలో రికార్డ్‌ అయింది.
మధ్య ప్రదేశ్‌లో ఊహించని సంఘటన జరిగింది. పహరావాలో పరిధిలో ఒక సాయి భక్తుడు బాబా పాదాల మీద పడి ప్రాణాలను అర్పించాడు. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో రాజేష్‌ అనే సాయి భక్తుడు విగ్రహం ముందు తల పెట్టి ప్రాణత్యాగం చేసుకున్నాడు. రాజేష్ మృతిపై నగరంలో పలు చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది దీనిని భగవంతుడు, భక్తుడి కలయిక అని పిలుస్తున్నారు. మరికొందరు దీనిని ఒక అద్భుతంగా భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ప్రతి గురువారం లాగే ఈ గురువారం కూడా దర్శనం కోసం రాజేష్ బాబా ఆస్థానానికి చేరుకున్నాడు. అక్కడ బాబా విగ్రహానికి ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజేష్ పాదాలకు తలవంచి నమస్కరించగా, అదే సమయంలో గుండె నొప్పికి గురై మరణించాడు. సుమారు 15 నిమిషాల తర్వాత అక్కడి నుంచి లేవకపోవడంతో ఆలయంలో ఉన్న భక్తులు పూజారికి తెలిపారు. పూజారి రాజేష్‌ని కదిలించగా.. శరీరంలో ఎలాంటి కదలిక లేదు.. నోటి నుంచి నురుగు రావడంతో.. ఇతర వ్యక్తుల సాయంతో రాజేష్‌ని పైకి లేపి ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. రాజేష్ మెహానీ నగరంలో మెడికల్ స్టోర్ ఆపరేటర్, అతను సాయిబాబాకు గొప్ప భక్తుడు. బాబా దర్శనానికి రోజూ గుడికి వెళ్లేవాడు.

 పూజారి ఏం అంటున్నారంటే..

శ్రీ సాయి దర్బార్ పూజారి రాజేష్ సాయి భక్తుడని, ప్రతి గురువారం ఆలయానికి వచ్చావాడని చెప్పారు. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం కూడా ఆయన ఆలయానికి వచ్చారు. దర్శనం చేసుకున్నా చాలా సేపటి వరకు నిద్ర లేవకపోవడంతో ఇతర భక్తులు ఈ విషయాన్ని నాతో చెప్పారు. వెళ్లి చూడగా నోటి నుంచి తెల్లటి శ్లేష్మం రావడంతో వెంటనే అక్కడి నుంచి లేపి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతను చనిపోయినట్లు చెప్పారు..
భక్తుల వాదన, భక్తుడు బాబా వద్దకు చేరుకున్నాడు. సాయి పాదాల వద్ద మరణించిన తర్వాత భక్తుడు నేరుగా బాబా వద్దకు చేరుకున్నాడని, అంటే బాబా ఈ భక్తుడిని నేరుగా తన వద్దకు పిలిచారని వారు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news