కేవలం 9 రోజుల్లో కరోనా బాధితులకు ప్రత్యేక ఆసుపత్రి నిర్మించిన చైనా.. ఎలాగంటే..?

-

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్న విషయం తెలిసిందే. ఏ కొద్దిగా జలుబు, నీరసం ఉన్నా.. ‘కరోనా’నేనా అనే అనుమానంతో చూడాల్సి వస్తుంది. చైనా నుంచి వచ్చేవాళ్లను వైద్య పరీక్షలు చేసిన తర్వాతే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టనిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓవైపు కరోనాకు మందు కనిపెట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు నిర్వహిస్తూనే, మరోవైపు బాధితుల కోసం అన్ని సదుపాయాలతో ప్రత్యేకంగా ఓ భారీ ఆసుపత్రి నిర్మించింది చైనా. ఈ 1000 పడకల ఆసుపత్రి కేవలం 9 రోజుల్లో నిర్మితమవడే అసలు అద్భుతం. కరోనా వైరస్ బాధితులకు ఇతర ఆసుపత్రులకు తరలిస్తే వ్యాధి ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుందని భావించి చైనీయులు ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణం ఆలోచన చేశారు.

అది కూడా కరోనా వైరస్ కు జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్ నగర శివార్లలో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో ప్రధానంగా ముందే రూపుదిద్దుకున్న కాంక్రీట్ బ్లాక్స్ ను ఉపయోగించారు. దానివల్ల ఎంతో సమయం ఆదా అయింది. పునాదులు వేసిన తర్వాత వాటిపై కాంక్రీట్ బ్లాక్స్ ను ఓ క్రమపద్ధతిలో అమర్చుకుంటూ వెళ్లారు. ఎక్కడిక్కడ జాయింట్లను పకడ్బందీగా కలుపుకుంటూ పోయారు. ఇందుకోసం దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న కాంక్రీట్ బ్లాక్స్ ను వుహాన్ తరలించారు. ఈ క్రతువులో 7 వేల మంది కార్మికులతో పాటు 1000 యంత్రాలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, 419 వార్డులు, 30 ఐసీయూలు ఉన్నాయి. 1400 మంది డాక్టర్లను ఇక్కడ నియమించనున్నారు. నేటి నుంచి ఇక్కడ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news