ఫుట్ పాత్ సరిగ్గా లేదని దాని మీద భరతనాట్యం చేసిన యువతులు…!

-

ఫుట్ పాత్ సరిగ్గా లేకుంటే ఏం చేస్తాం. అక్కడి అధికారులను తిట్టుకుంటూనే.. గంతులు వేస్తూనే దాన్ని దాటేస్తాం. తర్వాత దాని సంగతే మర్చిపోతాం. కానీ.. ఈ యువతులు మాత్రం అలా చేయలేదు. ఫుట్ పాత్ పగిలితే మాకేంది అని చూస్తూ ఊరుకోలేదు. తమ క్రియేటివిటీని జోడించారు. ఆ ఫుట్ పాత్ పై భరతనాట్యం చేస్తూ దాన్ని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో నెటిజన్లు కూడా ఆవీడియోపై స్పందిస్తూ అక్కడి అధికారులను ఎండగడుతున్నారు. అయితే.. అధికారుల మీద నిరసన కోసం ఇలా చేయలేదని.. ఆ ప్రాంతంలో ఉన్న ఫుట్ పాత్ సమస్య గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే ఇలా చేశామని ఆ యువతులు తెలిపారు. ఇంతకీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా. బెంగళూరులోని మల్లేశ్వరం అనే ప్రాంతంలో.

Read more RELATED
Recommended to you

Latest news